ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలి

ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలి

ముద్ర ,తంగళ్ళపల్లి:-రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ, మండేపల్లి ఓబులాపూర్ గ్రామాల్లో తంగళ్ళపల్లి మండల పోలీసులు పోలీస్ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 18 సంవత్సరాల వయస్సు నిండి ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరులు ఓటుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున ప్రజలు 50 వేల రూపాయల కంటే ఎక్కువ డబ్బులు తీసుకెళ్తే రసీదులు ఉండాలని, గ్రామాల్లో బెల్ట్ షాపులలో మద్యపానం అమ్మ రాదని, డబ్బులు మద్యం వంటి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మల్లేశం, నరేందర్, కార్తీక్, శ్రీకాంత్, సుధాకర్, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.