బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి

బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి
  • ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి  

మొగుళ్లపల్లి,  ముద్ర: బి ఆర్ ఎస్ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బీ ఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండలంలోని మొగుళ్ళపల్లి,గుడిపాడ్, గుండ్ల కర్తి, వేములపల్లి, నర్సింగాపూర్, మెట్టుపల్లి, మొ ట్లపల్లి గ్రామాలలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి ఆర్ఎస్ పార్టీ పేద ప్రజల అభివృద్ధి కోసం అనేకమైన మంచి పథకాలు మేనిఫెస్టోలో తీసుకురావడం జరిగిందని కార్యకర్తలు నాయకులు గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో పార్టీ చేసే అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోవాలని గులాబీ దళపతి కెసిఆర్ ఆధ్వర్యంలో వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉందని తర్వాత మన అభివృద్ధిని మన ప్రభుత్వమే చూసుకుంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొడారి. రమేష్ యాదవ్, జడ్పిటిసి జోరుక సదయ్య, ఎంపీపీ యారా సుజాత సంజీవరెడ్డి, పిఎసిఎస్  చైర్మన్ సంపెల్లి నరసింగరావు, మండ ల పార్టీ అధ్యక్షుడు  తిరుపతిరావు, వైస్ ఎంపీపీ పోలినేని రాజేశ్వరరావు,వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, ఆయా గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు