మాజీ సర్పంచ్ కుటుంబానికి కోడారి రమేష్ యాదవ్ ఆత్మీయ పరామర్శ

మాజీ సర్పంచ్ కుటుంబానికి కోడారి రమేష్ యాదవ్ ఆత్మీయ పరామర్శ

మొగుళ్ళపల్లి, ముద్ర : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని కొర్కిశాల గ్రామ మాజీ సర్పంచ్ అప్పం మల్లక్క 3 రోజుల క్రితం అనారోగ్యంతో  మృతిచెందగా..సన్నిహితుల ద్వారా విషయం తెలుసుకున్న చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోడారి రమేష్ యాదవ్ బుధవారం ఉదయం కొర్కిశాల గ్రామంలోని వాగు వద్ద దినం ముట్టిస్తున్న కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లి వారిని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేసి,  కుటుంబ సభ్యులకు    భరోసాను కల్పించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీనిచ్చారు. ఆమె పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి, మొగుళ్లపల్లి ఎంపీటీసీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఎర్రబెల్లి వనిత  పున్నం చందర్ రావు, కొర్కిశాల గ్రామ సర్పంచ్ దానవేణి రాములు, గణేష్ పల్లి సర్పంచ్ తిప్పారపు యుగేందర్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.