రమణన్న గెలుపు కోసం మహా అన్నదానం..

రమణన్న గెలుపు కోసం మహా అన్నదానం..
  • జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మరోమారు అత్యధిక మెజారిటీతో గెలవాలని కోరుతూ శుక్రవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ అన్నారు.

జిల్లాకేంద్రంలోని కారల్ మార్క్స్ కాలనీలో గల జీఎం కార్యాలయం దగ్గర దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని కమిటీ సభ్యులు మడికొండ రాకేష్, అజ్మీర అనిల్, అజ్మీర అరుణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ దుర్గాదేవి ఆశీస్సులతో జిల్లా వాసులు సుఖసంతోషాలతో, ఆర్థిక అభివృద్ధి సాధించాలని కోరారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో గండ్ర వెంకటరమణారెడ్డి గెలవాలని, ఆ దుర్గాదేవి ఆశీస్సులు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా దుర్గాదేవి ఆశీస్సులతో రాష్ట్రంలో కేసీఆర్ ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అర్బన్ యూత్ అధ్యక్షుడు బుర్ర రాజు గౌడ్, యూత్ జిల్లా నాయకులు దేవర ముత్తు, శ్రీకాంత్ పటేల్, రాకేష్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.