రాష్ట్రస్థాయి క్రీడలకు జూకల్ విద్యార్థులు ఎంపిక..

రాష్ట్రస్థాయి క్రీడలకు జూకల్ విద్యార్థులు ఎంపిక..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థినిలు రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరగాని కృష్ణ, వ్యాయామ  ఉపాధ్యాయుడు సాంబరాజు లు తెలిపారు.  హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలో జరిగిన  సాఫ్ట్ బాల్ పోటీలలో సీనియర్ విభాగంలో 33 జిల్లాల విద్యార్దులు  పాల్గొన్నారు. కాగా ఈ పోటీల్లో జూకల్ పాఠశాలకు చెందిన ఐశ్వర్య, మేఘన అనే విద్యార్థినులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపిక  కావడందని, రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థినులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరగాని కృష్ణ, పాఠశాల వ్యాయామ  ఉపాధ్యాయులు సాంబరాజు, గ్రామ సర్పంచ్ పుట్టపాక మహేందర్, ఎస్ఎంసి చైర్మన్ గుండెకారి  రమేష్  ఎంపీటీసీ జంబుల తిరుపతి, నాయకులు కోడారిరవి, ఉప సర్పంచ్ చాడ ఆనంద్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు రాధిక, రాణి, మమత, ఉమాదేవి, రంజిత్ కుమార్, స్వరూప, రూప, రాణి, రఫీ, మాధవి, యోగానంద చారి, రామకృష్ణ ప్రసాద్, పోచయ్యలు  అభినందించి, శాలువాలు, పూలమాలలు, మెమొంటోలతో ఘనంగా సన్మానించారు.