జలదిగ్బంధంలో  మోరంచపల్లె గ్రామం

  • ముగ్గురు గల్లంతు
  • వరద నీటిలో చిక్కుకున్న వెయ్యి మంది గ్రామస్తులు

ముద్ర,జయశంకర్ భూపాలపల్లి జిల్లా:-భూపాలపల్లి - పరకాల ప్రధాన రహదారి పై మొరంచ వాగు  దాదాపు 15 అడుగుల ఎత్తున ప్రవహిస్తున్నది. ముగ్గురు వరద నీటిలో కొట్టుకుపోయినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. వాగు ఉప్పొంగడంతో మొరంచపల్లి గ్రామం నీట మునిగింది. ప్రజలు బిల్డింగ్ పైకి ఎక్కి బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు.  సహాయం కొరకు ఎదురు చూస్తున్న స్థానిక ప్రజలు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి సహాయక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వివిధ ఛానళ్లకు పత్రికలకు ఫోన్ చేసి తమను కాపాడవలసిందిగా అధికారులకు చెప్పాలని ప్రాధేయపడుతున్నారు.