రైస్ మిల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర..

రైస్ మిల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం చాతరాజుపల్లికి చెందిన డ్యాగల భద్రయ్య రైస్ మిల్లును శుక్రవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సౌకర్యార్ధం శాతరాజుపల్లిలో రైస్ మిల్లు ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. రైతులకు అందుబాటూలో ఉన్న రైస్ మిల్లును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గణపురం వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్, మండల అధ్యక్షులు రేపాక రాజేందర్, బుద్ధారం గ్రామ సర్పంచ్ గండ్ర ఆగమరావు, ఉప సర్పంచ్ మల్లవెన రవి, సీనియర్ నాయకులు సంపత్ రావు, మాల భద్రయ్య, వంగపల్లి భాస్కర్, ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.