సమస్యల పరిష్కారం కోసం కాల్ సెంటర్ లు ఏర్పాటు చేస్తా.. 

సమస్యల పరిష్కారం కోసం కాల్ సెంటర్ లు ఏర్పాటు చేస్తా.. 
  • బిజెపి అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:సమస్యల పరిష్కారం కోసం ప్రతి మండలానికి ఒక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తానని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల అధ్యక్షులు జిట్టబోయున సాంబయ్య ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన గడప గడపకు  ప్రచారంలో భాగంగా మండలంలోని వేంకటేశ్వర పల్లి, బస్వరాజు పల్లి, రవినగర్, జంగుపల్లి, గొల్లపల్లి గ్రామాలలో కీర్తిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ నిరంతరం ప్రజల సమస్యల్ని తెలుసుకోవడం కోసం కాల్ సెంటర్ ఏర్పాటుచేసి తప్పకుండా న్యాయం చేస్తాం అని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షల రూపాయలు అందిస్తామని, ఎరువుల పై సబ్సిడీని ఇస్తుందని, వరి ధాన్యం మద్దతు ధర కల్పించిదని, గణపురం మండలంలో పెండింగ్ లో ఉన్న భూమి పట్టాలను పూర్తి చేసి అందజేస్తామన్నారు. భారతీయ జనతా పార్టీ మ్యానిఫెస్టోలో భూపాలపల్లి నియోజకవర్గంకు పెద్దపీట వేయడం జరుగుతుందని, అంతే కాకుండా రైతులకు, యువకులకు, మహిళలకు అందరికీ అనుకూలంగా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించాలని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చిట్టచివరి వరకు అర్హులందరికీ అందజేసే విధంగా నేను పని చేస్తానని ఆమే కోరారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు  పాల్గొన్నారు.