నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే సునీతను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనదే....

నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే సునీతను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనదే....
  • ఓటర్లను కోరిన బిఆర్ఎస్ నేతలు......

ఆలేరు (ముద్ర న్యూస్):గత రెండు పర్యాయాలు శాసనసభ సభ్యురాలుగా ఎన్నికై నియోజకవర్గానికి అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన ఆలేరు తాజా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలుగా మనందరిపై ఉందని ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య అన్నారు. మంగళవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో ఆయన పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి అభివృద్ధి. సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం పనిచేస్తూ దేశంలోని రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా నిలిపారని చెప్పారు. నవంబర్ 30న జరిగే శాసనసభ ఎన్నికలలో ఆలేరు నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మొరిగాడి మాధవి వెంకటేష్ గౌడ్. కౌన్సిలర్లు ఎర్ర దయామని దేవదానం.బేతి రాములు. రాయపురం నరసింహులు. దాసి నాగలక్ష్మి సంతోష్. మోర్తాల సునీత రమణారెడ్డి. కందుల శ్రీకాంత్. జూకంటి శ్రీకాంత్. పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్. నాయకులు జూకంటి వెంకటేష్. సరాబ్ సంతోష్ కుమార్. జూకంటి పెద్ద ఉప్పలయ్య. బైరి మహేందర్. జూకంటి ఉప్పలయ్య. కుతాటి అంజన్ కుమార్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.