అటు ఇటు చూసి ఆగం కావొద్దు

అటు ఇటు చూసి ఆగం కావొద్దు

భూపాలపల్లిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ప్రచారం
ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: అటు ఇటు చూడొద్దు.. ఆగం కావొద్దు.. అభివృద్ధి చేసిన కారు గుర్తుకు ఓటెయ్యాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు బాంబులగడ్డ, సీఆర్ నగర్ తోపాటు గణపురం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పాల్గొని మాట్లాడుతూ సీఆర్ నగర్, బాంబులగడ్డ ప్రాంతాలను అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకున్నామన్నారు. బాంబుల గడ్డ ప్రాంతానికి చెందిన 40మంది  నిరిపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు అందించామని గుర్తు చేశారు. ఈ ప్రాంతాన్ని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసుకోవాల్సి ఉందని, అందుకు నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో అందరూ కారు గుర్తుకు ఓటువేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.