ప్రజావాణిలో 42 దరఖాస్తులు స్వీకరణ.. 

ప్రజావాణిలో 42 దరఖాస్తులు స్వీకరణ.. 

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 42 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు సమస్యలతో కూడిన దరఖాస్తులను అందజేయగా కలెక్టర్ వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అందిన దరఖాస్తులను వెంటనే సంబంధిత శాఖలకు పంపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పెండింగ్ లో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించాలని ఆయా శాఖలకు చెప్పినట్లు కలెక్టర్ తెలియజేశారు.