బీఆర్ఎస్ ర్యాలీలో అపశృతి - కళ్లు తిరిగి పడిపోయిన బాలిక

బీఆర్ఎస్ ర్యాలీలో అపశృతి - కళ్లు తిరిగి పడిపోయిన బాలిక

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న ఓ బాలిక కళ్లు తిరిగి కిందపడి పోయింది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రాష్ట్రంలోని 9 మెడికల్ కాలేజీలను వర్చువల్ గా ప్రారంభిస్తున్న నేపథ్యంలో భూపాలపల్లి మెడికల్ కాలేజీ  ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా కార్యక్రమంలో పాల్గొన్న ఇదే పట్టణానికి చెందిన ప్రవళిక అనే బాలిక సృహ తప్పి కింద పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన మునిసిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు, స్థానిక మహిళలు బాలికను వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కొద్దిసేపటి తర్వాత బాలిక కోలుకోవడంతో స్థానిక నేతలు ఊపిరి పీల్చుకున్నారు.