ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిలో ఉద్రిక్తత..

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిలో ఉద్రిక్తత..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి బుధవారం బిజెపి శ్రేణులు యత్నించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బిజెపి నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. క్యాంపు ఆఫీసు ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరికీ బీజేపీ నేతలను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఆయా మండలాల్లో కూడా ఎక్కడికక్కడ బిజెపి నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.