బీజేపీ వస్తే బీసీ నాయకుడే సీఎం..

బీజేపీ వస్తే బీసీ నాయకుడే సీఎం..
  • ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నాయకుడే సీఎం అవుతారని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి  అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని కుందన్ పల్లి, బండపల్లి, వెల్లంపల్లి, గ్రామాల్లో శుక్రవారం బిజెపి భరోసా యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కీర్తిరెడ్డి పాల్గొని గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కీర్తిరెడ్డి మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కమలం పువ్వు గుర్తు మీద నేను పోటీ చేస్తున్నానని, మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు. గ్రామలలో అభివృద్ధి కావాలి అంటే భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకే మన ఓటు వేసి గెలిపించాలని అన్నారు.

ఒక ఇంటిని తీర్చిదిద్దేది మహిళలు కాబట్టి మీరు అందరూ కలిసి ఐక్యతా తో కలిసి నన్ను గెలిపిస్తే మీ గ్రామాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. భూపాలపల్లి నియోజకవర్గంలో పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తులను కాకుండా పార్టీ కోసం కష్టపడి అభివృద్ధికి కృషి చేసే వారిని ఆశీర్వదించాల్సిన అవసరం ఉందన్నారు. భారతీయ జనతా పార్టీ మ్యానిఫెస్టోలో అన్ని రకాల కులాలకు, వర్గాలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో మ్యానిఫెస్టోలో పెట్టడం జరిగిందని,బిజెపి అధికారంలోకి వస్తే సొంత ఇంటి కళ నేరవేస్తామని, ఉచితంగా రేషన్ బియ్యం అందించడం జరుగుతుందని తెలిపారు. అర్హులందరికీ పింఛను అందిస్తామని, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంచార్జీలు, మరియు ఎమ్మార్పీఎస్ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.