‘ఆరుట్ల’కు హారతిచ్చి స్వాగతిస్తున్నరు
ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామ బీజేపీ అభ్యర్థి ఆరుట్ల దశమంతరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం జిల్లాలోని బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి, నాగిరెడ్డిపల్లి, చిన్నరామన్చర్ల, గంగపురం గ్రామానికి ప్రచారానికి వెళ్లిన ఆరుట్లకు స్థానికులు హారతిచ్చి స్వాగతం పలికారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ దశమంతరెడ్డి ఓటు అభ్యర్థించారు. ఆయన వెంట బీజేపీ నేతలు బేజాడి బీరప్ప, సౌడ రమేశ్తో పాటు ఎమ్మార్పీఎస్ నేతలు ఉన్నారు.