ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందిస్తాం..

ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందిస్తాం..
  • బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందిస్తామని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు. బిజెపి భరోసా యాత్రలో భాగంగా భూపాలపల్లి మండలంలోని దూదేకులపాల్లి, దీక్షకుంట, గొళ్లబుద్దారం గ్రామాల్లో మండల అధ్యక్షుడు ఇచ్చంతుల విష్ణు అధ్వర్యంలో బుధవారం నిర్వహించిన గడప గడపకు ప్రచారం కార్యక్రమానికి ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిపిస్తే భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని, ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి ని ప్రజలకు వివరిస్తూనే, ఈ సారి కమలం పువ్వు గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించి, అశీర్వదించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బూత్ స్థాయి నాయకులు పాల్గొన్నారు.