ఆది రాంనర్సయ్య సేవలు చిరస్మరనీయం - వినోద్ కుమార్

ఆది రాంనర్సయ్య సేవలు చిరస్మరనీయం - వినోద్ కుమార్

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ ఉద్యమకారుడు ఆది రాంనర్సయ్య చేసిన సేవలు చిరస్మరనీయమని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం, రాఘవాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ ఆది రాంనర్సయ్య విగ్రహాన్ని శనివారం ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్ రావు లతో కలిసి వినోద్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాఘవాపూర్ కు చెందిన రాంనర్సయ్య అణగారిన వర్గాల అభ్యున్నతికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నిరంతరం ఉద్యమించడం జరిగిందన్నారు. గ్రామంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పార్టీకి ఆయన ఎనలేని సేవలందించారని, ఆయన లేని లోటు తీరనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాంనర్సయ్య సతీమణి, మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ ఆది రాజ్యలక్ష్మి, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.