భక్తులతో కిటకిట లాడుతున్న ఆలయాలు..

భక్తులతో కిటకిట లాడుతున్న ఆలయాలు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఆలయాలు శుక్రవారం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రావణ శుక్రవారం కావడంతో భక్తులు ఉదయాన్నే పుణ్యస్నానాలు చేసి, నూతన వస్త్రాలు ధరించి, సమీపంలోని ఆలయాలకు తరలివెల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా గ్రామాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఘనంగా నిర్వహించారు.