తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది

తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది
  • మాజీమంత్రి కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు

ముద్ర.కొల్లాపూర్:-ఆంధ్ర లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోతుంది అని తెలిసిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని మాజీ మంత్రి కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు అన్నారు,పల్లె పల్లెకు మన జూపల్లి కార్యక్రమంలో భాగంగా పానగల్ మండలం రేమద్దుల, తెళ్ళరాల్లపల్లి తాండ గ్రామాలలో  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ గతంలో పంచాయితీ రాజ్ మంత్రి గా ఉన్నప్పుడు తాండ లను గ్రామ పంచాయితీలు గా చేశానని, గిరిజన బందు ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి కెసిఆర్ మోసం చేశారని ఈ ఎన్నికల్లో గిరిజనులు అందరు బిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి కాంగ్రెస్ పార్టీనీ గెలిపించాలని కోరారు.

ఎమ్మెల్యే భిరం హర్షవర్ధన్ రెడ్డి కి ఒక్క సారి అవకాశం ఇస్తే కొల్లాపూర్ ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ అక్రమ కేస్ లు చేయిస్తూ ప్రజలను నానా రకాలుగా వేధిస్తున్నారు అని, తెలంగాణ ఉద్యమంలో ఇదే పరిస్థితి ఉండి ఉంటే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు.వచ్చిన తెలంగాణ లో కల్వకుంట్ల కుటుంబం తప్ప బాగుపడింది ఎవరు అని ప్రశ్నించారు. ప్రజలు అలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా మాజీ డిసిసి అద్యక్షులు శంకర్ ప్రసాద్ గారు,పాన్ గల్ మండల మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు, మాజీ జెడ్పిటిసి రవి,మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు  పాల్గొన్నారు.