భూపాలపల్లిలో బీఆర్ఎస్ సంబరాలు..

భూపాలపల్లిలో బీఆర్ఎస్ సంబరాలు..
  • పట్టణంలో భారీ ర్యాలీ..
  • హాజరైన మంత్రి సత్యవతి, ఎమ్మెల్యే గండ్ర..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు సంబురాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం నేపథ్యంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని హనుమాన్ టెంపుల్ నుండి మెడికల్ కాలేజ్ వరకు భారీ కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న తొమ్మిది మెడికల్ కాలేజీలను శుక్రవారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా వర్చువల్ గా ప్రారంభిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కళాకారుల ఆటపాటలు చూపరులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్మన్లు జక్కు శ్రీహర్షిని, గండ్ర జ్యోతి, పుట్ట మధు, వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, మునిసిపల్ చైర్మన్ సెగ్గం వెంకటరాణి సిద్ధు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ తోపాటు ముఖ్య నేతలు పాల్గొన్నారు.