కెసిఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి..
- అభివృద్ధి చేసిన వారిని ఆదరించాలి..
- ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి..
ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:-సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెంచరామి, అందుకుతండా, చైన్ పాక, వరికోల్ పల్లి, నైన్ పాక, జడల్ పేట తదితర గ్రామలలో మంగళవారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ ఎన్నికలు రాగానే ప్రజలు అభివృద్ధిని కాంక్షించే నాయకులను ఎన్నుకోవాలని, ప్రజల కోసం పనిచేసే నాయకులు ఎవరో గుర్తుంచుకోవాలన్నారు. గడిచిన 10 ఏళ్లలో మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు పూర్తి చేశారని, రాబోయే 5 ఏళ్లకు ఏం చేస్తామో ముఖ్యమంత్రి కేసీఆర్ మ్యానిఫెస్టోలో విడుదల చేయడం జరిగిందన్నారు.
మ్యానిఫెస్టోలో కేసీఆర్ బీమా, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపుతో ప్రతి ఇంటికి ధీమా ఇవ్వడం జరుగుతుందని, తెలంగాణ అన్నపూర్ణతో పేదలకు సన్నబియ్యం అందించడం, ఫించన్లు, రైతుబంధు పెంపు, అగ్ర వర్ణ పేద విద్యార్థులకు గురుకులాలతో అత్యుత్తమ విద్యనందించడం, అసైన్డ్ ల్యాండ్ పై ఆంక్షల ఎత్తివేతకు చర్యలతో బలహీనవర్గాలను ఆదుకోవడం లాంటి కార్యక్రమాలు చేపట్టబోతుండడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి, జడ్పీటీసీ గొర్రె సాగర్, పీఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతికుమార్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.