ఎలాంటి సంబరాలు చేసుకోవద్దు..

ఎలాంటి సంబరాలు చేసుకోవద్దు..
  • 144 సెక్షన్ అమలులో వుంది...
  • ఎస్సై దేవేందర్

శాయంపేట,ముద్ర : మండలంలోని అన్ని గ్రామల  రాజకీయ పార్టీ నాయకులకు ఎస్సై దేవేందర్  ఒక ప్రకటన తెలియజేసారు. రేపు అసెంబ్లీ ఎలక్షన్ కౌంటింగ్ వుంది కావున ఫలితాల అనంతరం ఏ రాజకీయ పార్టీ నాయకులు సంబరాలు చేసుకోవద్దని అన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు 144 సెక్షన్ అమలులో వుంది కాబట్టి డిజేలకు, ర్యాలీలకు, టపాసులు పేల్చడం గాని చేయవద్దని నాయకులకు సూచించారు. 24 గంటల తర్వాత పర్మిషన్ తీసుకొని  సంబరాలు చేసుకోవచ్చని తెలిపారు.