తెలంగాణలో బిజెపి పాలన రావాలి..

తెలంగాణలో బిజెపి పాలన రావాలి..
  • అన్ని వర్గాల ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓటెయ్యాలి..
  • బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణలో బిజెపి పాలన రావాలని, అన్ని వర్గాల ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓటెయ్యాలని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ఒడితల, కొత్తపేట, దూత్ పల్లి, లక్ష్మీపురంతండా తదితర గ్రామాల్లో సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బిజెపి మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి చందుపట్ల కీర్తి రెడ్డి హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధి చేస్తుందన్నారు. గ్రామాలలో చెత్తాచెదారం లేకుండా ఉండేందుకు స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టిందన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి రైతులకు అతి తక్కువ ధరలకు ఎరువులను పంపిణీ చేసేలా చర్యలు తీసుకుందన్నారు. రైతులు పండించిన పంటలకు కేంద్రం గిట్టుబాటు ధర కల్పించిందని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం అనేక కార్యక్రమాలు చేపట్టిన బిజెపిని ఆదరించాలని కోరారు. గ్రామ గ్రామాన బిజెపికి అపూర్వ స్పందన కనిపిస్తుందని, ప్రజల సహకారంతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలువబోతున్నామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మోర్తెల రాజేందర్, మాచర్ల రఘు, గణేశ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.