చేనులలో రైతు కూలీలకు బిఆర్ఎస్ ప్రచారం

చేనులలో రైతు కూలీలకు బిఆర్ఎస్ ప్రచారం

మహాదేవపూర్, ముద్ర: మండల కేంద్రములో వ్యవసాయ చేనులల్లో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆన్కారి ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని  దండగ అంటే  రైతులకి 24 గంటల విద్యుత్ ఇస్తూ, రైతు బంధు సహాయం చేస్తూ   వ్యవసాయాన్ని పండుగ చేస్తున్న కెసిఆర్ ప్రభుత్వం కావాలా? 3 గంటల కరెంట్ ఇస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావాలో ఆలోచించాలని అన్నారు.బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా పుట్ట మధుకర్ కు  ఓటు వేసి గెలిపించాలని రైతులను, రైతుకూలీలను విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చాగర్ల రవీందర్,కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ కలికోట దేవేందర్,  బిఆర్ఎస్ పార్టీ యూత్ నియోజవర్గం ప్రధాన కార్యదర్శి మెరుగు శేఖర్, కొక్కు పున్నం, పెండ్యాల నర్సింహస్వామి తదితరులు పాల్గొన్నారు.