బిఆర్ఎస్ పార్టీలో యువకుల చేరిక

బిఆర్ఎస్ పార్టీలో యువకుల చేరిక

మహాదేవపూర్, ముద్ర: మండలంలోని సూరారం గ్రామం యువకులు సర్పంచ్ శ్రీపతి బాపు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థి పుట్ట మధు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు మంథని నియోజకవర్గంలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ మంథని నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై చేరినట్లు వారు తెలిపారు. నీలారపు శ్రీధర్, సూదుల మధుకర్, ముల్లు రాజు, ముల్లు అనిల్ మేకల రాజు, పొలం లక్ష్మణ్ సుల్తాన్, సందీప్, నాలం మనోజ్, బీసుల మల్లేష్ లు పార్టీలో చేరిన్నట్లు పార్టీ అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూరారం సర్పంచ్ నాగుల లక్ష్మారెడ్డి, సర్పంచ్ శ్రీపతి బాపు, మండల ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్, నాయకులు రవి, సాగర్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.