ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు..

ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: ములుగు జిల్లాలోని ఏటూరునాగారం ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సమక్షంలో బుధవారం ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన చత్తీస్​గఢ్ అటవీ ప్రాంతంలో గల గ్రామాల నుండి మద్వి ఆదామ కమలేష్(32), సుంకరి నారాయణ(30), సుంకరి సుధాకర్(35)లు లొంగిపోయినట్లు ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ వారి గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకుని సాధారణ జీవితం గడపడానికి మావోయిస్టు పార్టీని వారు వీడినట్టు చెప్పారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకునేందుకు, వారి కుటుంబసభ్యుల భవిష్యత్​కోసం పనిచేయాలని నిర్ణయించుకుని పోలీసులకు లొంగిపోయారని తెలిపారు.  మిలీషియా సభ్యులందరికీ అవసరమైన సహాయం అందించడానికి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. వీరు వెంకటాపురం పోలీసుల ఆధ్వర్యంలో లొంగిపోగా, అక్కడి పోలీసులను ఏఎస్పీ అభినందించారు.