సత్యాగ్రహ దీక్షకు తరలిరండి కాటారం మండల కాంగ్రేస్ పార్టీ అద్యక్షుడు వేమునూరి ప్రభాకర్ రెడ్డి

సత్యాగ్రహ దీక్షకు తరలిరండి కాటారం మండల కాంగ్రేస్ పార్టీ అద్యక్షుడు వేమునూరి ప్రభాకర్ రెడ్డి

కాటారం, ముద్ర న్యూస్:- కాంగ్రేస్ పార్టీ అగ్రనేత, ఏఐసీసీ మాజీ అద్యక్షుడు రాహుల్ గాంధీ పై విధించిన అనర్హత వేటుకు నిరసనగా ఈనెల 14 న మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీఎల్పీ నాయకులు మల్లు బట్టి విక్రమార్క సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నారని కాటారం మండల కాంగ్రేస్ పార్టీ అద్యక్షుడు వేమునూరి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం కాటారంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ సత్యాగ్రహ దీక్షకు ఏఐసీసీ అద్యక్షుడు మళ్ళికార్జున ఖర్గే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు లతో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరౌతున్నారని పేర్కొన్నారు.కేంద్రంలో మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రేస్ అగ్రనేతలైన సోనియా గాంధీ పై ఈడీ వేదింపులు, రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసి ఉద్దేశ్యపూర్వకంగా అణిచివేయాలని చూస్తున్నదని వివరించారు.కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాలు కాంగ్రేస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై అవలంబిస్తున్న తీరును ప్రజల్లో ఎండగట్టి చైతన్యం తీసుకురావడానికి ఒక్కరోజు సత్యాగ్రహ దీక్షకు పూనుకున్నారని తెలిపారు. దీక్షకు మద్దతుగా ఎన్ఎస్యూఐ, యువజన, సీనియర్, మహిళా, రైతు అనుబంధ సంఘాల నేతలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.