గోశాల నిర్మాణానికి ఎంపి భూమి పూజ
ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసాలో ఎంపి లాడ్స్ నిధులతో నిర్మించనున్న గోశాల కు ఆదిలాబాద్ ఎంపి సోయం బాపురావు శనివారం భూమిపూజ చేశారు. రూ.10 లక్షలతో ఈ నిర్మాణం జరపనున్నారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని రాష్ట్ర నాయకులు పుప్పాల రాజన్న తదితరులు పాల్గొన్నారు.