పోలీసు తనిఖీల్లో 60 కి పైగా వాహనాల పట్టివేత

పోలీసు తనిఖీల్లో 60 కి పైగా వాహనాల పట్టివేత

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో పోలీసులు గురువారం తెల్లవారుజామున కార్డెన్ సర్చ్ నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో సరైన ధ్రువ పత్రాలు లేని 59 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, 4 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బైంసా సిఐ శ్రీ నివాస్ తోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.