ఆత్మీయంగా అభ్యర్థిస్తూ...
ముద్ర ప్రతినిధి, జనగామ : బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సతీమణి పొన్నాల అరుణదేవి కోరారు. శుక్రవారం పట్ణణంలోని 13వ వార్డులో కౌన్సిలర్ మల్లిగారి చంద్రకళ రాజు, పానుగంటి ప్రవీణ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి సతీమణి నీలిమతో కలిసి ప్రచారం చేశారు.
ఇంటింటికి తిరుగూ ఆత్మీయంగా పలకరిస్తూ పల్లాకు ఓటేయాలని అభ్యర్థించారు. వారి వెంట బీఆర్ఎస్ పట్టణ మహిళ అధ్యక్షురాలు చెంచారపు పల్లవి, మిద్దెపాక లెనిన్, నల్ల వినోద్, గంగాభవానీ, సౌడ శాంతి, మేడ గంగ, బొట్ల పుష్ప తాటికాయల యాదమ్మా ఉన్నారు.