మోసపోవద్దు.... గోస పడొద్దు

మోసపోవద్దు.... గోస పడొద్దు
  • స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ అభ్యర్థి

ముద్ర,స్టేషన్ ఘనపూర్ :-బారాస నాయకులు చెప్పుతున్న కల్లబొల్లి మాటలు విని మరోసారి మోస పోయి గోసపడుద్దని స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సింగపురం ఇందిరా అన్నారు. మంగళవారం ఎన్నికల్లో భాగంగా జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలంలోని హిమ్మత్ నగర్, తిమ్మాపూర్ మగ్గంతండా, ఓబులాపూర్, గ్రామాలలో పర్యటించిన అనంతరం మండల కేంద్రానికి చేరుకుని   పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఇందిరా మాట్లాడుతూ కాంగ్రెస్  అధికారంలోకి వస్తే. ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామన్నారు. గ్రామాలలో ఉన్న  రోడ్డు, పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రి డ్రైనేజ్ వ్యవస్థ తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు.9 ఏళ్ల తొమ్మిదేళ్ల బిఆర్ఎస్ పాలనలో గ్రామాలను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసింది కానీ కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు గడిచిన ఒక రైతుకు కూడా ఇక రుణమాఫీ చేసింది లేదు ఇచ్చింది లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డి కు దక్కిందన్నారు. ఈనాడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ముందుకు సాగుతుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూ తీరుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ అన్నబోయిన బిక్షపతి. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మంచాల ఎల్లయ్య, నూకల ఐలయ్య ముక్తార్ అలీ, తాటికాయల రాజేందర్, అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.