జిల్లాలో ప్రారంభమైన నామినేషన్ల పర్వం

జిల్లాలో ప్రారంభమైన నామినేషన్ల పర్వం

 జనగామ టౌన్/స్టేషన్ ఘన్ పూర్/పాలకుర్తి, ముద్ర:  తెలంగాణ రాష్ట్ర శాసనసభ  ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం జనగామ జిల్లాలో శుక్రవారం ప్రారంభమైంది.  నామినేషన్ల మొదటి రోజు జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామానికి చెందిన మంద యాకమల్లు  స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగా

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి తాటికాయల గ్రామానికి చెందిన బల్లె పాక రాజేష్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. వీరు తమ నామినేషన్లను ఆయా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. కాగా జనగామ నియోజకవర్గం నుండి మొదటి రోజు ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదని జనగామ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్  శివలింగయ్య తెలిపారు.