చెక్ పోస్ట్ తనిఖీ చేసిన కలెక్టర్
జనగామ టౌన్, ముద్ర: జనగామ జిల్లా ఎన్నికల అధికారి సిహెచ్ శివలింగయ్య జిల్లా సరిహద్దు పెంబర్తి, జీడికల్ క్రాస్ రోడ్ గ్రామాలలో ఏర్పాటుచేసిన పోస్టును శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కేంద్ర బలగాలు జిల్లాకు చేరుకున్నాయని ప్రతి ఒక్కరు ఎన్నికల నిబంధన పాటించాలన్నారు.
చెక్ పోస్ట్ లో విడుదలవారీగా 24 గంటలు సిబ్బంది విధులు నిర్వహిస్తూ రికార్డు రిజిస్టర్ లను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. చెక్పోస్ట్ దగ్గర పట్టుబడ్డ డబ్బులు వస్తువుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం వీడియో సర్వేలెన్సు సిస్టం చిత్రీకరించాలన్నారు. ఆయన వెంట ఎన్నికల ఆఫీసర్లు నరేందర్ రెడ్డి , డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మొగలప్పా తదితరులు ఉన్నారు.