ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి
  • జిల్లా స్వీఫ్ నోడల్ ఆఫీసర్ వినోద్ కుమార్
  • ఓటు హక్కు వినియోగంపై జిల్లాలో విస్తృతంగా  ప్రచారం

ముద్ర ప్రతినిధి, జనగామ : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా స్వీఫ్ నోడల్ ఆఫీసర్ వినోద్ కుమార్ అన్నారు.జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఆదేశాల మేరకు జిల్లాలో శుక్రవారం ఓటు హక్కు పై అవగాహన కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రజాస్వామ్యంలో ఓటు  వినియోగించుకోవడం మన బాధ్యత అన్నారు. 


తెలంగాణ సాంస్కృతిక సారథులచే ఓటు హక్కు వినియోగంపై క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించడం జరుగుతుందని, మూడు నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు, ప్రధాన కూడళ్లలో హోర్డింగ్స్, ఫ్లెక్సీస్ ద్వారా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్, తెలంగాణ సంస్కృతిక సారధులు రత్నం, శంకర్, గణేష్, సంజీవ, కనకరాజు, చందు, సోమయ్య, స్వప్న, పద్మ, మమత,రంజాన్ బితదితరులు పాల్గొన్నారు.