పల్లా కోసం ఇంటింటి ప్రచారం

పల్లా కోసం ఇంటింటి ప్రచారం

జనగామ టౌన్, ముద్ర : జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. శుక్రవారం పట్టణంలోని 13వ వార్డులో కౌన్సిలర్ మల్లిగారి చంద్రకళ రాజు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

జనగామ అభ్యర్థిగా బరిలో ఉన్న రాజేశ్వర్ రెడ్డిని గెలిపించి కెసిఆర్ కు కానుకగా ఇవ్వాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు పానుగంటి ప్రవీణ్ రాజు తదితరులు పాల్గొన్నారు.