వెండి పాదాల తొడుగులు బహుకరణ

వెండి పాదాల తొడుగులు బహుకరణ

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామికి రామంతపూర్ (హైదరాబాదు) నివాసి వెంకటరామిరెడ్డి-సదాదేవి, నవీన్-హరిత కుటుంబ సభ్యులు వెండి పాదాల తొడుగులు అలంకరణ నిమిత్తము బహుకరించి వారి మ్రొక్కుబడిని చెల్లించు కున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో బి.లక్ష్మీ ప్రసన్న, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు రంగాచార్యులు, రవీంద్ర శర్మ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.