వీ ఆర్కే కళాశాల వద్ద తేనేటీగల హల్చల్...

వీ ఆర్కే కళాశాల వద్ద తేనేటీగల హల్చల్...

ముద్ర, మల్యాల: మల్యాల మండలం నూకపల్లి శివారులోని వీ ఆర్కే ఇంజనీరింగ్ కళాశాల వద్ద తేనేటీగలు హల్చల్ చేశాయి. ధర్మపురి అసెంబ్లీ ఫలితాల వివాదంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సోమవారం అధికారులు ఈవీఏంలు భద్రపరిచి ఉన్న స్ట్రాంగ్ రూమ్ తెరువడానికి ఏర్పాట్లు చేశారు.  

అధికారులతో పాటు, పెద్ద ఎత్తున నాయకులు, భద్రత సిబ్బంది, పాత్రికేయులు చేరుకున్నారు. ఈ క్రమంలో కళాశాలపై ఏర్పడిన తేనేటీగల గుంపు ఒక్కసారిగా దాడికి పాల్పడడంతో అక్కడున్నవారు పరుగులు పెట్టారు.