ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించడం అభినందనీయం.. - ములుగు ఎమ్మెల్యే సీతక్క

ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించడం అభినందనీయం.. - ములుగు ఎమ్మెల్యే సీతక్క

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించడం అభినందనీయమని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ములుగు జిల్లాలోని జంగాలపల్లి గ్రామం రాంనగర్ లో సోమవారం గ్రామ పెద్దలు ఏర్పాటు చేసిన అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ఎమ్మెల్యే సీతక్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గుడి అభివృద్ధి కోసం తమవంతు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా, ఆకుతోట చంద్రమౌళి, మామిడిశెట్టి కోటి తదితరులు పాల్గొన్నారు.