ఏసీబీకి చిక్కిన ఇండస్ట్రియల్ మేనేజర్..

ఏసీబీకి చిక్కిన ఇండస్ట్రియల్ మేనేజర్..
  • రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇండస్ట్రియల్  మేనేజర్ లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా రూ. 53 లక్షలకు ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన గుగులోతు లచ్చీరాం గత సంవత్సరం అశోక్ లేలాండ్ వాహనాన్ని చేశారు. ఇందుకు సంబంధించి సబ్సిడీ కోసం లచ్చీరాం కొద్ది రోజుల క్రితం జిల్లా పరిశ్రమల శాఖలో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి శ్రీనివాస్ లచ్చీరాం నుంచి లంచం డిమాండ్ చేశారు. ఈ మేరకు మొదట రూ. 50 వేలు అప్పగించాడు. అనంతరం మళ్లీ రూ. 60 వేలు కావాలని డిమాండ్ చేయడంతో లచ్చీరాం ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఈ క్రమంలో గురువారం లచ్చీరాం రూ. 15వేలు ఇస్తుండగా జిల్లా పరిశ్రమల అధికారి శ్రీనివాస్‌ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతడిని హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.