పల్లెల్లో బారులు తీరుతున్న ఓటర్లు..

పల్లెల్లో బారులు తీరుతున్న ఓటర్లు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మారుమూల ప్రాంత పల్లెలో ఉదయాన్నే ఓటర్లు బారులు తీరారు. వ్యవసాయ పనుల దినం కావడంతో ఆయా గ్రామాల్లోని కూలీలు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.