సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ప్రచారం

సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ప్రచారం

మహాదేవపూర్, ముద్ర: మండలంలోని సీనియర్ సిటిజన్ల ఓట్లను రాబట్టేందుకు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రత్యేక ప్రచారాన్ని చేపట్టారు. వీరు రిటైర్డ్ ఉద్యోగులను, 60 సంవత్సరాలు పైబడిన విద్యావంతులను కలుస్తూ కెసిఆర్ ప్రభుత్వం గురించి, మేనిఫెస్టో గురించి ఇతర సమకాలిన పరిస్థితులపై సుదీర్ఘంగా వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. వీరిలో నెహ్రూక్లబ్ అధ్యక్షులు సీనియర్ బిఆర్ఎస్ నాయకులు అన్కారి ప్రభాకర్, ప్రముఖ రైతు జాడిగట్టయ్య, కాళేశ్వరం దేవస్థానం మాజీ చైర్మన్ పోత వెంకటస్వామి, కాళేశ్వరం దేవస్థానం ప్రస్తుత ధర్మకర్త కలికోట దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.