అడవి పందులను తప్పించబోయి కారు బోల్తా - వైస్ ఎంపీపీ భర్త మృతి, నలుగురికి గాయాలు

అడవి పందులను తప్పించబోయి కారు బోల్తా - వైస్ ఎంపీపీ భర్త మృతి, నలుగురికి గాయాలు

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: అడవి పందులను తప్పించబోయి కారు బోల్తా పడి ప్రమాదానికి గురైన సంఘటన శుక్రవారం తెల్లవారుజాము న చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ వైస్ ఎంపిపి భర్త, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు బండం లక్ష్మారెడ్డి, మరో నలుగురు కలిసి గుంటూరు లో కుమారుని వివాహం ఫిక్స్ చేసుకొని కారులో  తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో భూపాలపల్లి- కాటారం  జాతీయ రహదారిపై ఒక్కసారిగా పందులు రావడంతో వాటిని తప్పించపోయి  సఫారి కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో వైస్ ఎంపిపి భర్త, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు బండం లక్ష్మారెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను భూపాలపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కారు ప్రమాదంలో వైస్ ఎంపీపీ భర్త మృతి చెందడంతో మహాదేవపూర్ మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.