మానవత్వం చాటిన బిజెపి మంథని ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రుపట్ల సునీల్ రెడ్డి 

మానవత్వం చాటిన బిజెపి మంథని ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రుపట్ల సునీల్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి:  మానవత్వం చాటుకున్నారు మంథని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల సునీల్ రెడ్డి గురువారం ఉదయం రామగిరి మండలంలోని మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారి రాజాపూర్ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనగా   ఎన్నికల ప్రచారం నిమిత్తం అటువైపు వెళుతున్న సునీల రెడ్డి రోడ్డు పైన తీవ్ర గాయాలైన నలుగురిని చూసి తన. వాహనం అపి వారికి ధైర్యం చెప్పి తన వాహనం లో ఎక్కించి మంథని హాస్పిటల్ కు తరలించారు. ఎన్నికల సమయంలో ముందుగా ఇచ్చిన బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ గాయాలతో బాధపడుతున్న వారిని చూసి చలించి మానవత్వం చాటుకున్న సునీల్ రెడ్డిని పలువులు అభిస్తున్నారు.