పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెక్కులు అందించిన ఎమ్మెల్యే గండ్ర

పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెక్కులు అందించిన ఎమ్మెల్యే గండ్ర

చిట్యాల ముద్ర న్యూస్: జయశంకర్ భూపాలపల్లి, జిల్లాలోని చిట్యాల మండలంలోని అందుకు తండ, వరి కోల్ పల్లి, కుమ్మరిపల్లి ,అకాల వర్షాలకు పంట నష్టపోయిన112 మంది రైతులకు 83700 రూపాయల చెక్కులను భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణ రెడ్డి అందించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్ద పీట వేస్తుందని రైతులకు రైతుబంధు, రైతు బీమా, అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం, అందిస్తూ రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తూ రైతులకు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు‌.

రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రైతులందరూ అండగ నిలిచి ఆదరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గొర్రె సాగర్, ఎంపీపీ  దావూ వినోద, పి ఎ సి ఎస్ సి చైర్మెన్ క్రాంతి కుమార్ రెడ్డి ,సర్పంచ్ సాంబయ్య, భాస్కర్, ఎంపీటీసీ కట్టెకొల్ల రమేష్ ,అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.