తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నరు..

తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నరు..
  • బిజెపి అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి పట్టం కట్టడం ఖాయమని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు. భూపాలపల్లి బీజేపీ అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జంగేడు, ఆకుదారివాడ, ఫకీర్ గడ్డలో నిర్వహించిన గడపగడపకు ప్రచారంలో భూపాలపల్లి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి మాట్లాడుతూ అమ్ముడుపోయే నాయకులను, భూకబ్జా కోర్లను తరిమి తరిమి కొట్టాలని, కమలం పువ్వును గెలిపించాలని పిలుపు నిచ్చారు. నియోజకవర్గంలోని జంగేడు, ఆకుదారి వాడలను బొందల గడ్డగా మార్చిన ఘనత మన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కుతుందని అన్నారు.

తెలంగాణ వచ్చిన  తర్వాత రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారన్న కెసిఆర్ మాట తప్పి, మళ్లీ మాయమాటలతో గారడి వేషాలతో ఓటర్లను మరొక్కసారి  మోసం చేయాలని చూస్తున్నారని, ప్రజలందరూ తిరగబడి మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల గణపతి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు దొంగల రాజేందర్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వెశాల సత్యవతి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బట్టు రవి, జిల్లా ప్రచార కార్యదర్శి మందాల రఘునాథరెడ్డి, ప్రచార కార్యదర్శి దొంగల కుమార్, అర్బన్ ప్రధాన కార్యదర్శి తుమ్మేటి రామ్ రెడ్డి, అర్బన్ ఉపాధ్యక్షులు జోడు కృష్ణ కాంత్, కోరే సుధాకర్, కరివేద మనోహర్, మామిడి పవన్, ఊరేటి మునేందర్, లీగల్ సెల్ కన్వీనర్ చీర్ల అశోక్ రెడ్డి, పడగంటి పురుషోత్తం, నాయకులు భూక్య భాగ్య, బురా పద్మ, రేగూరి సురేష్, బోరం రాజయ్య, వీరబాబు, నాంపల్లి కుమార్, బుర్ర సాయి గౌడ్, భానోత్ వెంకట్, సందీప్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.