శ్రీ ఆండాళ్ తిరుక్షత్రం కోటంచ ఆలయంలో ప్రేత్యేక పూజలు

శ్రీ ఆండాళ్ తిరుక్షత్రం  కోటంచ ఆలయంలో ప్రేత్యేక పూజలు

ముద్ర న్యూస్ రేగొండ: సుప్రసిద్ధ శ్రీ లక్ష్మి నరసింహ్మ స్వామి వారి ఆలయంలో శ్రీ ఆండాళ్ తిరుణక్షత్రం అమ్మవారి జయంతి ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు.శనివారం కోటంచ శ్రీ లక్ష్మి నరసింహ్మ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మత్రోత్సరాల నడుమ శ్రీ ఆండాళ్ అమ్మవారికి ఒడి బియ్యం,కుంకుమార్చన,నిర్వహించి అమ్మ వారి సేవ,అరగింపు,గ్రామ పురవీధుల్లో అమ్మవారిని ఊరేగించారు,అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈ ఓ బిళ్ళ శ్రీనివాస్,ఆలయ చైర్పర్సన్ మాదాడి అనిత కర్నాకర్,సర్పంచ్ పబ్బా శ్రీనివాస్,ధర్మకర్తలు.గైని కుమార స్వామి,పోగు సుమన్, రవి, శ్రావణ్ , రాజు .గ్రామస్తులు కొలుగురి సంపత్ రావు,గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు...