ట్రాన్స్ ఫార్మర్ ఎర్త్ వైర్ తగిలి పాడి గేదె మృతి

ట్రాన్స్ ఫార్మర్ ఎర్త్ వైర్ తగిలి పాడి గేదె మృతి

ముద్ర న్యూస్ రేగొండ- విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో పాడి గేదె మృతి చెందిన ఘటన  రూపిరెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామాములోని  రామాలయం ముందు ఉన్నా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఎర్త్ వైరుకు విద్యుత్ సరఫరా కావడంతో బుధవారం ఉదయం పంచగిరి రాజు, అనే రైతుకు చెందిన పాడి గేదె మేత కోసం వెళ్లడంతో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఎర్త్ వైరుకు తగలడంతో,   గేదె మృతి అక్కడికక్కడే మృతి చెందింది.

పాడి  గేదె విలువ సుమారుగా 60 వేల రూపాయలు ఉంటుందని రాజు పడిగేదను నమ్ముకొని జీవనం సాగిస్తున్నాని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తాడు. అధికారుల నిర్లక్ష్యంతో ఎర్త్ వైర్ కు విద్యుత్ సరఫరా కావడంతో ఈ ఘటన జరిగిందని బాధితుడు ఆరోపిస్తున్నారు. విద్యుత్ అధికారులు సకాలంలో స్పందించి మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాడు.