బిఅర్ఎస్ ను గెలిపిద్దాం అభివృద్ధికి బాటలు వేద్దాం. 

బిఅర్ఎస్ ను గెలిపిద్దాం అభివృద్ధికి బాటలు వేద్దాం. 

మోత్కూర్(ముద్ర న్యూస్): మండలంలోని దాచారం గ్రామంలో టిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం గ్రామ శాఖ అధ్యక్షులు కడమంచి వస్తాద్  అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మదర్ డైరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొనతం యాకోబూ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గాదరి కిషోర్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని అన్నారు . బిఅర్ఎస్ ప్రభుత్వం  లో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు.   ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొండా సొమ్మల్లు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు  పామునుగుల్ల విష్ణుమూర్తి,నాయకులు అండెం  రాజిరెడ్డి,సూరారం యాదగిరి,బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.