ప్రతి మహిళా ఆది శక్తి కావాలి

ప్రతి మహిళా ఆది శక్తి కావాలి
  • మండల పరిషత్ కార్యాలయంలో
  • మహిళా దినోత్సవ వేడుకలు

ముద్ర న్యూస్ : రేగొండ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని బుధవారం ఎంపీపీ పున్నం లక్ష్మి రవి   ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు మండలంలోని మహిళా ఉద్యోగుల ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం నుండి ఇందిరా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్బంగా ఎంపీపీ లక్ష్మి మాట్లాడుతు ప్రతి మహిళా రాజకీయంగా ఎదగాలని తెలంగాణ రాష్ట్రంలో మహిళాలకు అన్ని విధాలా గౌరవం దక్కిందని మహిళలకు పెద్ద పిటవేస్తున్న సీఎం కెసిఆర్ కి మహిళలు కృతఙ్ఞత భావంతో ఉండాలని ప్రతి మహిళా అది శక్తిలా మారాలని దేశంలో జరుగుతున్న అత్య చారాలపై అవగాహన కలిగి ఉండాలని ఏదైనా సంఘటన జరిగినప్పుడు అది పరశక్తిలా ఎదుర్కోవాలని తెలిపారు 

ఈ కార్యక్రమం లో మెడికల్ ఆఫీసర్ హిమబిందు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి,మండల పంచాయతీ అధికారి,కార్యాలయ సిబ్బంది, ఐ సి డి ఎస్.సూపర్వైజర్ సంధ్యారాణి,ఐ కె పి ఉమాదేవి, అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు ఏఎన్ఎం  ఐకెపి సిబ్బంది పాల్గొన్నారు