షర్మిల మౌనదీక్ష భగ్నం.. అరెస్ట్
హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన మౌనదీక్షను పోలీసులు భగ్నం చేశారు. ట్యాంక్బండ్పై రాణి రుద్రమదేవి విగ్రహం వద్ద చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి షర్మిలను అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను బొల్లారం పోలీస్స్టేషన్కు తరలించారు.